పాక్‌ సపోర్ట్‌తో అఫ్గాన్ టెర్రరిస్టులు కాశ్మీర్​లోకి చొరబడే చాన్స్

పాక్‌ సపోర్ట్‌తో అఫ్గాన్ టెర్రరిస్టులు కాశ్మీర్​లోకి చొరబడే చాన్స్

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్​లో పరిస్థితు లు చక్కబడ్డాక, అక్కడి టెర్రరిస్టులు పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ సాయంతో జమ్మూకాశ్మీర్​లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె చెప్పారు. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు. శనివారం ఇండియా టుడే కాన్ క్లేవ్​లో ఆయన మాట్లాడారు. ‘‘జమ్మూకాశ్మీర్​లో టెర్రరిస్టుల యాక్టివిటీలు పెరిగాయి. అయితే వాటితో అఫ్గాన్​కు సంబంధం ఉందో? లేదో? చెప్పలేం. ఇంతకుముందు అఫ్గాన్​ను తాలిబాన్లు పాలించిన టైమ్​లో ఆ దేశానికి చెందిన టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్​లోకి చొరబడ్డారు. ఇప్పుడూ అది రిపీట్ అయ్యేందుకు అవకాశం ఉంది” అని చెప్పారు.

మరిన్ని వార్తల కోసం..

హుజురాబాద్‌కు 3 నెలల్లో 4 వేల కోట్లు

టార్గెట్ చేసి టెర్రర్ అటాక్స్: మళ్లీ క్యాంపుల్లోకే కాశ్మీరీ పండిట్లు!

కేంద్ర మంత్రి కొడుకు ఆశిష్ మిశ్రా అరెస్టు