మంత్రి పర్యటన.. చంటిబిడ్డతో మహిళా కానిస్టేబుల్ డ్యూటీ

మంత్రి పర్యటన.. చంటిబిడ్డతో మహిళా కానిస్టేబుల్ డ్యూటీ

రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ ఇవాళ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో ఓ మహిళా కానిస్టేబుల్ చంటి బిడ్డతో డ్యూటీ చేసింది. జిల్లాలోని పేపర్ మిల్లు మైదానంలో హెలికాప్టర్ దిగి అక్కడి నుంచి పోలీస్ ఓ స్టేషన్ ప్రారంభోత్సవానికి మంత్రి వెళ్లారు. అయితే ఆ మహిళా కానిస్టేబుల్, మంత్రి వచ్చి వెళ్లే వరకు బిడ్డను చంకనెత్తుకొని నిలుచోనే ఉంది. 

కుమ్రం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం వంజిరి గ్రామం దగ్గర పోలీస్ స్టేషన్ కొత్త భవనాన్ని హోమంత్రి మహమూద్ ఆలీ ప్రారంభించారు. ఆ తర్వాత రెబ్బెన మండలంలో మరో పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అందవెళ్లి బ్రిడ్జిని మంత్రులు పరిశీలించారు.