అనస్థీషియా డోస్​ ఎక్కువై మహిళ మృతి

అనస్థీషియా డోస్​ ఎక్కువై మహిళ మృతి
  • హైదరాబాద్  కేపీహెచ్​బీ కాలనీ మెడ్​క్వెస్ట్​ డయాగ్నోస్టిక్స్​లో ఘటన

కూకట్​పల్లి, వెలుగు: వైద్య పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్​కు వెళ్లిన ఓ మహిళ డాక్టర్​ ఇచ్చిన అనస్థీషియా డోస్​ ఎక్కువై, మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం..  హైదరాబాద్ ఖాజాగూడకు చెందిన ఎస్.సూర్యలక్ష్మి(66)  మంగళవారం  కొడుకు  వెంకట అభిషేక్​తో కలిసి కేపీహెచ్​బీ కాలనీలోని మెడ్​క్వెస్ట్​ డయాగ్నోస్టిక్​సెంటర్​కు వెళ్లింది. రన్నీ నోస్​సమస్యతో బాధ పడుతున్న ఈమె సీటీ క్యాస్టెనోగ్రఫీ చేయించుకోవాల్సి ఉంది.

ఈ టెస్ట్​కు ముందు అక్కడి డాక్టర్​ఆమెకు అనస్థీషియా ఇచ్చారు. అయితే, డోస్​ఎక్కువ కావడంతో సూర్యలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సెంటర్​వైద్యులు, సిబ్బంది ఈ విషయాన్ని బాధితురాలి కొడుక్కి  చెప్పకుండా జాప్యం చేశారు. అనుమానం వచ్చి న కొడుకు తల్లిని ఓ ప్రైవేట్ ​హాస్పిటల్​కు తీసుకెళ్లగా  మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డయాగ్నోస్టిక్​సెంటర్ వైద్యులు,​ సిబ్బంది నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే తన తల్లి చనిపోయిందని మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.