ఫైనల్‌‌‌‌‌‌‌‌పై గురి కొరియాతో ఇండియా సెమీస్​

ఫైనల్‌‌‌‌‌‌‌‌పై గురి కొరియాతో ఇండియా సెమీస్​

రాంచీ:  ఆసియా చాంపియన్స్‌‌‌‌‌‌‌‌ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో అజేయంగా దూసుకెళ్తున్న ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌ ఫైనల్‌‌‌‌‌‌‌‌పై గురి పెట్టింది. లీగ్ దశలో అన్ని మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు గెలిచిన జోష్​లో ఉన్న ఆతిథ్య జట్టు శనివారం జరిగే సెమీఫైనల్లో కొరియాతో తలపడనుంది. గురువారం జరిగిన లీగ్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో కొరియాను 5–0తో చిత్తు చేసిన ఇండియన్స్‌‌‌‌‌‌‌‌ నాకౌట్‌‌‌‌‌‌‌‌ పోరులోనూ అదే రిజల్ట్‌‌‌‌‌‌‌‌ను రిపీట్‌‌‌‌‌‌‌‌ చేయాలని చూస్తున్నారు. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ సవితా పునియా డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ను ముందుండి నడిపిస్తోంది. టోర్నీలో ఇండియా ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల్లో ప్రత్యర్థులకు మూడే గోల్స్‌‌‌‌‌‌‌‌ ఇచ్చుకుంది. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో ఫార్వర్డ్స్, మిడ్​ఫీల్డర్లు సమన్వయంతో కదులుతూ టీమ్‌‌‌‌‌‌‌‌కు 21 గోల్స్‌‌‌‌‌‌‌‌ అందించారు. వాళ్లు అదే జోరు కొనసాగిస్తే ఇండియా ఫైనల్ చేరడం పెద్ద కష్టమేం కాబోదు.