
రాంచీ: సొంతగడ్డపై విమెన్స్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో ఇండియా హాకీ టీమ్ శుభారంభం చేసింది. సంగీత కుమారి హ్యాట్రిక్ గోల్స్తో విజృంభించడంతో శుక్రవారం జరిగిన ఓపెనింగ్ మ్యాచ్లో ఇండియా 7–1తో థాయ్లాండ్ను చిత్తు చేసింది. సంగీత (29, 45, 45వ నిమిషాల్లో) మూడు గోల్స్ కొట్టగా.. మౌనిక (7వ ని.), సలీమా టెటే (15వ ని.), దీపిక (40వ ని.), లాల్రెమ్సియామి (52వ ని.) ఒక్కో గోల్ రాబట్టారు. శనివారం జరిగే మ్యాచ్లో మలేసియాతో ఇండియా తలపడనుంది.