పొంటెవాడ్రా (స్పెయిన్): ఇండియా యువ రెజ్లర్ సాజన్ భన్వాల.. అండర్–23 వరల్డ్ చాంపియన్షిప్లో బ్రాంజ్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. బుధవారం జరిగిన మెన్స్ 77 కేజీల బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్ బౌట్లో సాజన్ 10–10తో దిమిత్రో వెసెట్స్కీ (ఉక్రెయిన్)పై గెలిచాడు. దీంతో ఈ చాంపియన్షిప్లో గ్రీకో రోమన్ కేటగిరీలో పతకం నెగ్గిన తొలి ఇండియన్గా రికార్డు సృష్టించాడు.
స్టార్టింగ్లో ఉక్రెయిన్ రెజ్లర్ అద్భుతమైన పట్టుతో నాలుగు పాయింట్లు సాధించి ఆధిక్యంలో నిలిచాడు. కానీ వెంటనే పుంజుకున్న సాజన్ 10–10తో స్కోరు సమం చేశాడు. చివర్లో బలమైన పట్టుతో ఒక పాయింట్ లీడ్లోకి వెళ్లి విజేతగా నిలిచాడు.