
యాదాద్రి, వెలుగు : సార్.. వానపడితే రూములు కురుస్తున్నాయి' అని కలెక్టర్ హనుమంతరావుతో హాస్టల్ స్టూడెంట్స్ విన్నవించారు. జిల్లాలోని మోటకొండూరులోని బీసీ బాలికల గురుకులాన్ని సోమవారం రాత్రి కలెక్టర్ఆకస్మికంగా సందర్శించారు. స్టూడెంట్స్ను కలిసి మాట్లాడారు. రూమ్స్ కురుస్తుండడం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్టూడెంట్స్వాపోయారు. హాస్టల్కు వచ్చే రోడ్డు కూడా సరిగా లేదని తెలిపారు. దీంతో వెంటనే రిపేర్ చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారు.
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే చర్యలు..
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో పీసీపీ ఎన్డీటీ చట్టం అమలుపై నిర్వహించిన రివ్యూ మీటింగ్లో ఆయన మాట్లాడారు. స్కానింగ్ సెంటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. రూల్స్ అతిక్రమిస్తే స్కానింగ్ సెంటర్ల రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతోపాటు సిఫారసు చేసిన డాక్టర్, స్టాఫ్ జైలు శిక్షతోపాటు జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.