టీజీవో స్టేట్ ప్రెసిడెంట్‌‌గా ఉపేందర్ రెడ్డి

టీజీవో  స్టేట్ ప్రెసిడెంట్‌‌గా ఉపేందర్ రెడ్డి

యాదాద్రి, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ అధికారుల రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్‌‌గా యాదాద్రి జిల్లాకు చెందిన మందడి ఉపేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఆయన గతంలో టీఎన్​జీవో  రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్​గా బాధ్యతలు నిర్వర్తించారు.  30 ఏండ్లుగా స్టేట్​లెవల్లో ఉద్యోగ సంఘాల బాధ్యుడిగా వ్యవహరించారు.  

ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికులు సమస్యలను పరిష్కరించడంలో చురుగ్గా వ్యవహరించారు. అసోసియేట్​ ప్రెసిడెంట్​గా ఎన్నికైన ఉపేందర్​రెడ్డిని ఆర్డీవో కృష్ణారెడ్డి, టీజీవో  జిల్లా అధ్యక్షుడు సీహెచ్ జగన్ మోహన్ ప్రసాద్,  టీఎన్జీవో అధ్యక్షుడు భగత్, ఖదీర్, కంచనపల్లి శ్రీకాంత్, పి. రామారావు, ప్రియాంక, మేఘలత, ఎం. కృష్ణ అభినందించారు.