వేదికపై కుప్పకూలిన బొత్స : గరివిడి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స

వేదికపై కుప్పకూలిన బొత్స :  గరివిడి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. 2025, జూన్ 4వ తేదీ ఉదయం.. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో పార్టీ చేపట్టిన వెన్నుపోటు దినం ర్యాలీలో పాల్గొన్నారాయన. ర్యాలీలోనే వేదికగా ఏర్పాటు చేసిన వాహనంపై నుంచి మాట్లాడుతున్న సమయంలో.. ఒక్కసారిగా కుప్పకూలిపోయారు బొత్స. మాట్లాడుతూ.. మాట్లాడుతూనే బొత్స సత్యనారాయణ కుప్పకూలిపోవటంతో.. అందరూ షాక్ అయ్యారు. 

వైసీపీ నేతలు, కార్యకర్తలు అందరూ వెంటనే అప్రమత్తం అయ్యి.. బొత్సను సమీపంలోని గిరివిడి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రమాదం లేదని డాక్టర్లు వెల్లడించారు. బీపీ, షుగర్ ఉండటం వల్ల.. తీవ్రమైన ఎండలో పాదయాత్ర చేయటం వల్ల అనారోగ్యానికి గురయ్యారని.. రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు వెల్లడించారు. 

బొత్స అనారోగ్యానికి గురయ్యారనే విషయం తెలిసిన వెంటనే పార్టీ అధినేత జగన్.. ఫోన్ లో మాట్లాడారు. అనారోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. బొత్స కుటుంబ సభ్యులతోనూ జగన్ ఫోన్ లో మాట్లాడి దైర్యం చెప్పారు. విశ్రాంతి తీసుకోవాలని బొత్సకు సూచించారు జగన్.