
హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికి ఆరేస్తుండగా కరెంట్ షాక్ తో యువకుడు మృతిచెందాడు. కరెంట్ వైర్లను నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే..
గురువారం(అక్టోబర్23) మియాపూర్ పరిధిలోని అల్విన్ కాలనీలో మహేందర్ అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. తను ఉంటున్న బిల్డింగ్ బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి మహేందర్ కు షాక్ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.