పోక్సో కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు శిక్ష..కూకట్​పల్లి ఫాస్ట్​ ట్రాక్ కోర్టు తీర్పు

పోక్సో కేసులో యువకుడికి 20 ఏండ్ల జైలు శిక్ష..కూకట్​పల్లి ఫాస్ట్​ ట్రాక్ కోర్టు తీర్పు

కూకట్​పల్లి, వెలుగు: పోక్సో కేసులో ఓ యువకుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కూకట్​పల్లి ఫాస్ట్​ట్రాక్​కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలానగర్​ఇన్​స్పెక్టర్​ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్​ఫిరోజ్​గూడకు చెందిన బక్రత్​అలీ(21) 2022లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో బాలానగర్​ పోలీసులు పోక్సో యాక్ట్​కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు ఆధారాలతో చార్జ్​షీట్​దాఖలు చేశారు. కూకట్​పల్లి ఫాస్ట్​ట్రాక్​కోర్టు స్పెషల్​జడ్జి జె.విక్రమ్​శనివారం తీర్పు ఇచ్చారు. బక్రత్​అలీకి 20 ఏండ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు.