ప్రజలు ఆదేశిస్తే రాజీనామా చేస్త: జడ్పీ చైర్​పర్సన్​ సరిత

ప్రజలు ఆదేశిస్తే రాజీనామా చేస్త: జడ్పీ చైర్​పర్సన్​ సరిత
  • టికెట్ కు అడ్డొస్తున్నానని అవమానిస్తున్నరు
  • గద్వాల జడ్పీ చైర్​పర్సన్​ సరిత 

గద్వాల, వెలుగు: ‘‘ప్రజలతో ఎన్నుకోబడ్డ.. నా  పదవికి రాజీనామా చెయ్య..  బీఆర్ఎస్ పార్టీలో అడుగడుగునా అవమానాలే.. తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారాల్సి వచ్చింది..” అని గద్వాల జడ్పీ  చైర్​పర్సన్​ సరిత చెప్పారు. మంగళవారం విలేకరుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..  తాను పార్టీలో ఉంటే ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ కు అడ్డువస్తాననే ఉద్దేశంతో ఎన్నో అవమానాలకు గురి చేశారన్నారన్నారు.  

జిల్లాలో జరిగే ఎన్నో మీటింగ్ లకు పిలవకుండా ఇబ్బంది పెట్టారని,  ఆత్మాభిమానం చంపుకోలేక, బహుజన వాదాన్ని బలపరిచేందుకు పార్టీని వీడానన్నారు.  తనను ప్రజలే ఎన్నుకున్నారని, వారు ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.  ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, తిరుపతయ్య, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.