
- ఓ యువకుడిని కొట్టిన పోలీసులు
- బీజేపీ కార్యకర్తలకూ సేమ్ ట్రీట్మెంట్
- మీడియా పాస్ల జారీలోనూ గందరగోళం
పద్మారావునగర్, వెలుగు: లష్కర్బోనాల వేడుకల్లో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆదివారం అమ్మవారి దర్శనం కోసం లైన్లలో నిల్చున్న ఓ యువకుడితో పాటు స్థానిక బీజేపీ కార్యకర్తపైనా పోలీసులు చేయిచేసుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి రాగా, తనను పక్కకి లాక్కెళ్లి కొట్టారని సదరు యువకుడు వాపోయాడు. అలాగే, ఆదివారం రాత్రి స్థానిక బీజేపీ కార్యకర్త సందీప్సాగర్తన కుటుంబసభ్యులతో దర్శనానికి రాగా ఇదే ట్రీట్మెంట్ఇచ్చారు.
ఇక ఈ ఏడాది మీడియా పాస్ల జారీలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్లాన్ప్రకారం పాస్లు ఇవ్వాల్సి ఉండగా, అవేవీ పట్టించుకోకుండా ఫస్ట్కమ్ఫస్ట్సర్వ్లా ఎవరు ముందు వస్తే వారికే పాస్లు ఇచ్చారు. దీంతో పలు మీడియాలకు సంబంధించిన జర్నలిస్టులు వెళ్తే పాస్లు అయిపోయాయని తిప్పి పంపారు. డీపీఆర్వో నుంచి తమ పేర్లు వచ్చినా, తమ దగ్గర అక్రిడిటేషన్కార్డులు ఉన్నా పోలీసులు పాస్లు ఇవ్వలేదని పలువురు మీడియా ప్రతినిధులు వాపోయారు.