
నెల్లికుదురు (కేసముద్రం), వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని అమీనాపురం భూనీళా సమేత వేంకటేశ్వర స్వామి అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం స్వామివారి కల్యాణానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్య మురళి నాయక్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం స్వామివారి రథోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఆలయ కమిటీ వారు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.