ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌‌‌‌ కార్డులు : వివేక్ వెంకటస్వామి

ప్రజా ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌‌‌‌ కార్డులు : వివేక్ వెంకటస్వామి
  • బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ హయాంలో ఒక్క డబుల్​ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదు: వివేక్ వెంకటస్వామి
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌ ఫ్యామిలీ కమీషన్ల బిజీలో ఉండి ప్రజలను పట్టించుకోలేదు
  • అర్హులకు ఇండ్లు ఇప్పించే బాధ్యత నాదే
  • చెన్నూరు నియోజకవర్గంలో రూ.100 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నయ్‌‌‌‌
  • ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసిన ఎమ్మెల్యే 

కోల్​బెల్ట్/కోటపల్లి/చెన్నూరు, వెలుగు: గతంలో పేదలకు ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు కూడా తమ సర్కారే ఇస్తున్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. పదేండ్ల బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ పాలనలో ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఆ పార్టీ ఇవ్వలేదని విమర్శించారు.

 గురువారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. రాంపూర్, దేవులవాడ, కొల్లూరు, రాజారాం, అన్నారం, బబ్బరచెల్క, లక్ష్మిపూర్, వెల్మపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. చెన్నూరు మున్సిపల్ ఆఫీసులో వన మహోత్సవంలో పాల్గొని, మొక్కలు నాటారు. మున్సిపల్ సిబ్బందికి శానిటరీ కిట్లను పంపిణీ చేశారు.

 కేసీఆర్ ఫ్యామిలీ పదేండ్లు కమీషన్ల బీజీలో ఉండి ప్రజలను పట్టించుకోలేదని మండిపడ్డారు. తనకు వంద పడకల ప్రగతి భవన్, కొడుకు, బిడ్డకు వందల ఎకరాల్లో ఫాంహౌస్‌‌‌‌లు కట్టిన కేసీఆర్.. పేదలకు మాత్రం ఒక్క డబుల్ బెడ్రూం ఇల్లు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. 

రాష్ట్ర ఖజానాను కేసీఆర్ ఖాళీ చేయడం వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా మారిందని, అయినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రజలు ఇండ్లను నిర్మించుకోవాలని, ఆఫీసర్లు, లీడర్లు కూడా వారికి సహకరించాలని ఎమ్మెల్యే సూచించారు. నియోజకవర్గంలో అర్హులందరికీ ఇండ్లను ఇప్పించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. 

ఫారెస్ట్ అనుమతుల కోసం కృషి.. 

కోటపల్లి మండలంలో ఫారెస్టు పర్మిషన్లు రాక అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందని వివేక్ వెంకటస్వామి చెప్పారు. రాజారాం గ్రామ రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ పర్మిషన్లు ఇవ్వలేదన్నారు. తన ఆదేశాల మేరకు అటవీ భూములకు బదులు మరో చోట 42 ఎకరాల భూమికి మంచిర్యాల కలెక్టర్ ఫారెస్ట్ శాఖకు అప్పగించారని తెలిపారు. మరో ఆరు నెలల్లో ఈ సమస్య పరిష్కారమవుతుందని, రాజారాం గ్రామానికి రోడ్డు నిర్మించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. గ్రామంలో ఇప్పటికే రూ.26 లక్షలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, మరో రూ.20 లక్షలు సాంక్షన్ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

రాజారాం స్కూలుకు విశాక ట్రస్టు ద్వారా బెంచీలు, స్టూడెంట్లకు బ్యాగులు అందిస్తానని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. వివిధ గ్రామాల్లో గ్రామస్తులు చెప్పిన సమస్యలను విన్న ఎమ్మెల్యే.. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అయా గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యే వివేక్​కు ఘనస్వాగతం పలికి సన్మానించారు. 

దొడ్డు బియ్యంతో దందా చేసిండ్రు..

బీఆర్ఎస్ పాలనలో పంపిణీ చేసిన దొడ్డు బియ్యాన్ని ప్రజలెవరూ తినలేదని, ఆపార్టీ లీడర్లే దొడ్డు బియ్యం దందా చేశారని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం సన్నబియ్యం అందిస్తున్నదని చెప్పారు. పేదలకు సన్న బియ్యం ఇచ్చేందుకు సన్న వడ్లు సాగు చేసే రైతులకు రూ.500 బోనస్​ ఇస్తూ ప్రోత్సహిస్తోందన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్‌‌‌‌‌‌‌‌ తమ హయాంలో కొత్తగా ఒక్క రేషన్ కార్డు, పింఛన్లు కూడా ఇవ్వలేదన్నారు. 

కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం రేషన్ కార్డు తరహాలో ఫ్యామిలీ కార్డులు ఇస్తోందని, కొత్త పింఛన్లు కూడా శాంక్షన్ చేయనుందని వెల్లడించారు. చెన్నూరు మండలం సోమనపల్లిలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటేడ్ స్కూల్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఏడాది కాలంలో సీఎం రిలీప్ ఫండ్ ద్వారా రేవంత్‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌ రూ.900 కోట్లు కేటాయించిందని తెలిపారు.