బోర్ మోటార్ చోరీ చేశాడని .. కట్టేసి కొట్టారు.. మెదక్ జిల్లాలో ఘటన !

బోర్ మోటార్ చోరీ చేశాడని .. కట్టేసి కొట్టారు.. మెదక్ జిల్లాలో ఘటన !
  • మెదక్ జిల్లా ముగ్దుంపూర్ లో ఘటన 

శివ్వంపేట. వెలుగు: చోరీలకు పాల్పడుతున్న యువకుడిని జెండా దిమ్మెకు కట్టేసి గ్రామస్తులు చితకబాదిన ఘటన మెదక్​జిల్లాలో జరిగింది.  వివరాల్లోకి వెళ్తే.. శివ్వంపేట మండలం ముగ్దుంపూర్ కు చెందిన గొల్ల ప్రశాంత్ స్థానికంగా చోరీలకు పాల్పడుతున్నాడు. ఆదివారం (జూన్ 29) తెల్లవారు జామున గ్రామానికి చెందిన చంద్రం, వరమ్మ ఇంటి ముందు ఉన్న సంపులోని మోటార్లు చోరీ అయ్యాయి.

 ప్రశాంత్ పై అనుమానం రావడంతో గ్రామస్తులు అతడిని పట్టుకుని పంచాయతీ ఆఫీసు వద్ద జెండా దిమ్మెకు కట్టేసి చితకబాదారు. దీంతో తనే  మోటార్లు చోరీ చేశానని ఒప్పుకొని తీసుకొచ్చి ఇచ్చాడు. కొద్ది రోజుల కింద ఎల్లమ్మ ఆలయంలో పంచలోహా విగ్రహం సైతం చోరీ చేసినట్టు గుర్తించారు. ప్రశాంత్ బోరు మోటార్ల వైర్లు చోరీలు చేస్తుండగా గ్రామస్తులు పలుమార్లు మందలించినా మారడం లేదు.