శ్రీ కాళహస్తిలో 21 కి చేరిన కరోనా కేసులు

శ్రీ కాళహస్తిలో 21 కి చేరిన కరోనా కేసులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కొత్త‌గా 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదైన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ భ‌ర‌త్ నారాయ‌ణ గుప్తా తెలిపారు. న‌మోదైన కేసుల్లో 8 మంది పోలీసు, రెవెన్యూ, వార్డు సచివాలయ ఉద్యోగులని ఆయ‌న తెలిపారు. వారెవ్వ‌రూ రెడ్ జోన్‌ల‌కు వెళ్ల‌క‌పోయినా.. వైద్యపరీక్షల్లో కరోనా సోకినట్లు నిర్ధారణ అయింద‌ని, వ్యాధి వ్యాప్తికి కారణాలను అన్వేషిస్తున్నామ‌ని అన్నారు. వైర‌స్ సోకిన వారంద‌ర్నీ క్వారెంటైన్ కు త‌ర‌లించామ‌ని తెలిపారు. శ్రీకాళహస్తిలోని ఓ మెడికల్ దుకాణం నిర్వాహకుడికి, అందులో ప‌నిచేసే వారికి కరోనా సోక‌డంపై పూర్తిస్థాయి విచారణ చేస్తున్నామ‌ని, ఆ దుకాణంలో మందులు కొనుగోలు చేసిన వారు స్వచ్ఛందంగా వైద్య పరీక్షలకు ముందుకు రావాల‌ని క‌లెక్ట‌ర్ కోరారు. ఇప్పటికే మున్సిపాలిటిలో 10 కరోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా కొత్త వాటితో కలిపి మొత్తం కేసుల సంఖ్య‌ 21 కి చేరింద‌ని తెలిపారు.

11 new covid-19 positive cases reported in srikalahasthi