న్యూఢిల్లీ: ఇన్ఫ్లేషన్ తగ్గుముఖం పట్టడంతో 2023 లోనూ రెసిడెన్షియల్ ఇండ్ల అమ్మకాల జోరు కొనసాగుతుందని జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. 2022లో ఈ సేల్స్ 68 శాతం పెరిగినట్లు పేర్కొంది. కస్టమర్లకు ఈ ఏడాది బిల్డర్లు మంచి డీల్స్ ఆఫర్ చేస్తారని, ఫలితంగా సేల్స్ మొమెంట్ కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 2022లో మొత్తం 2,15,666 రెసిడెన్షియల్ ఇండ్లు అమ్ముడయినట్లు వెల్లడించింది. అంతకు ముందు ఏడాది ఈ అమ్మకాలు 1,28,064 యూనిట్లేనని పేర్కొంది. దేశంలోని ఏడు ప్రధాన సిటీలు ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్కతా, పుణెలలో రెసిడెన్షియల్ ఇండ్ల అమ్మకాలను తాము ట్రాక్ చేస్తున్నట్లు జేఎల్ఎల్ వివరించింది. రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ల డేటా మాత్రమే ఇందులో ఉందని, రో హౌస్లు, విల్లాలు వంటివి కలపలేదని కూడా తెలిపింది.
ఇన్ఫ్లేషన్ తగ్గుతున్న నేపథ్యంలో 2023లోనూ రెసిడెన్షియల్ ఇండ్ల అమ్మకాల జోరు కొనసాగుతుందని జేఎల్ఎల్ అంచనా వేస్తోంది. ఎక్కువ టెనూర్తో లోన్లు, ఆకర్షణీయమైన రేట్లు వంటివి బయ్యర్లను ఈ ఏడాది ఆకట్టుకుంటాయని పేర్కొంది. వడ్డీ రేట్లు పెరిగినా 2022లో ఇండ్ల అమ్మకాలు పెరగడం గమనించాలని జేఎల్ఎల్ ప్రస్తావించింది. దేశపు ఎకానమీ పటిష్టంగా ఉండటంతో ఇండ్ల సేల్స్ ఊపు బాగుంటుందని అంచనా వేస్తున్నట్లు జేఎల్ఎల్ ఎండీ శివ కృష్ణన్ చెప్పారు. సొంత ఇల్లు కొనుక్కోవాలనే కోరిక దేశంలో చాలా మందికి కలగడం వల్లే డిమాండ్ పెరుగుతోందని సిగ్నేచర్ గ్లోబల్ ఛైర్మన్ ప్రదీప్ అగర్వాల్ పేర్కొన్నారు. హౌసింగ్ సెక్టార్కు ఊతమిచ్చేలా రాబోయే బడ్జెట్ ఉండాలని చెప్పారు.