హైదరాబాద్, వెలుగు: సెరామిక్ టైల్స్ తయారీ కంపెనీ హెచ్ అండ్ ఆర్ జాన్సన్ (ఇండియా) హైదరాబాద్లో శనివారం మూడు వేల కొత్త టైల్ డిజైన్లను ప్రదర్శించింది. వీటిలో అన్ని చోట్లకు సరిపోయే టైల్స్ఉన్నాయని తెలిపింది. అన్ని రకాల బిల్డింగ్ మెటీరియల్స్ను ఒకే గొడుగు కింద డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. తమ టైల్స్ నెగటివ్ అయాన్లను విడుదల చేయడం ద్వారా సెరోటోనిన్ స్థాయిలను పెంచుతాయని పేర్కొంది. దీనివల్ల నివాసితులకు ఒత్తిడి తగ్గుతుందని ప్రకటించింది. ఆవిష్కరణలకు తమ కంపెనీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ విజయ్ మిశ్రా చెప్పారు. హెచ్ ఆర్ అండ్ జాన్సన్ టైల్స్, శానిటరీవేర్, బాత్ ఫిట్టింగ్లు ఇంజనీర్డ్ మార్బుల్, క్వార్ట్జ్లను అందిస్తుంది.
