ప్రజాభవన్​ ప్రజావాణికి 461 అర్జీలు

ప్రజాభవన్​ ప్రజావాణికి 461 అర్జీలు

పంజాగుట్ట, వెలుగు :  బేగంటపేటలోని మహాత్మ జ్యోతిరావుఫూలే ప్రజాభవన్​లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 461 అర్జీలు అందాయి. ఇందులో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 139, మైనార్టీ సంక్షేమం కోసం105, రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులు 74, సివిల్ సప్లై విభాగానికి 54 ఫిర్యాదులు అందాయి. మిగతా 89 జీరో కరెంట్​బిల్, ఆరోగ్యశ్రీ, లేఅవుట్​కబ్జాలకు సంబంధించి వచ్చాయని అధికారులు చెప్పారు. 

తాము అర్హులమైనా జీరో కరెంట్​బిల్లుకు సంబంధించి విద్యుత్​శాఖ నుంచి ఎటువంటి సమాచారం రాలేదంటూ కొందరు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ప్రజావాణి ఇన్​చార్జి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ ​చిన్నారెడ్డి ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నోడల్ ఆఫీసర్ దివ్య దేవరాజన్​పర్యవేక్షణలో అధికారులు ఫిర్యాదులను స్వీకరించారు.