జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ మినీ బస్సు లోయలో పడిన ఘటనలో 11 మంది మృతిచెందారు. వీరిలో 9మంది విద్యార్థినులు ఉన్నారు. మరో ఏడుగురు గాయపడ్డారు.పూంఛ్లోని ఓ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కు చెందిన విద్యార్థులతో బయల్దేరిన మినీ బస్సు పీర్కిగలీ ప్రాంతంలో లోయలో పడింది. దీంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన వారిని షోపియాన్ ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద ఘటనపై జమ్ముకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసదుపాయం అందించాలని అధికారులను ఆదేశించారు.