గోపి జి. దర్శకత్వంలో కొత్త చిత్రం షురూ

గోపి జి. దర్శకత్వంలో కొత్త చిత్రం షురూ

తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా గోపి జి. దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.  ఈ  చిత్రాన్ని ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస నిర్మిస్తున్నారు. పూజా  కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ  మొదటి షాట్‌‌ను దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్ట్ చేయగా, బీ.ఆర్.ఎస్ లీడర్  దాసోజు శ్రవణ్ క్లాప్ కొట్టారు.

నిర్మాత రవి పనస కెమెరా స్విచ్చాన్ చేశారు.  రొమాంటిక్  పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుంచి మొదలైంది. కన్నడ నటుడు రిషి,  రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.