తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా గోపి జి. దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ మూవీ మొదటి షాట్ను దర్శకుడు వేణు ఊడుగుల డైరెక్ట్ చేయగా, బీ.ఆర్.ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ క్లాప్ కొట్టారు.
నిర్మాత రవి పనస కెమెరా స్విచ్చాన్ చేశారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ బుధవారం నుంచి మొదలైంది. కన్నడ నటుడు రిషి, రవీందర్ విజయ్, షెల్లీ కిషోర్, కాలకేయ ప్రభాకర్, చిరాగ్ జానీ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.