ఏసీబీ వలలో అగ్రికల్చర్ ఆఫీసర్

ఏసీబీ వలలో అగ్రికల్చర్  ఆఫీసర్

వికారాబాద్​, వెలుగు: ఫర్టిలైజర్​ షాపు పర్మిషన్​ కోసం లంచం డిమాండ్​ చేసిన అగ్రికల్చర్​ ఆఫీసర్​ ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికిపోయాడు. ఉమ్మడి రంగారెడ్డి ఏసీబీ డీఎస్​పీ ఆనంద్​కుమార్​ తెలిపిన ప్రకారం.. 

మోమిన్​పేట మండలకేంద్రంలో కొత్తగా ఫర్టిలైజర్​ షాప్​ పెట్టుకోవడానికి ఓ వ్యక్తి మండల వ్యవసాయ శాఖాధికారి భూపతి జయశంకర్​ను పర్మిషన్​ కోరాడు. అందుకు ఆయన రూ.లక్ష డిమాండ్​ చేశారు. బాధితుడు అంత ఇచ్చుకోలేని చెప్పడంతో రూ.50 వేలకు అంగీకరించారు. బాధితుడు బుధవారం రూ.50 వేలు జయ శంకర్​కు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్​కు పంపారు.