దేశంలోనే తొలి విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్‌‌‌‌

దేశంలోనే తొలి విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్‌‌‌‌

న్యూఢిల్లీ:  అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏజీఈఎల్​)  అనుబంధ సంస్థ ఏహెచ్​ఈజేఓఎల్ రాజస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌లోని జైసల్మేర్‌‌‌‌లో 390 మెగావాట్లు విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ ప్లాంట్‌‌‌‌ను ప్రారంభించింది.  ఇది దేశంలోనే మొట్టమొదటి విండ్​– సోలార్ హైబ్రిడ్ పవర్​ జెనరేషన్​ ఫెసిలిటీ. ఈజేఓఎల్​కు సోలార్​ పవర్​ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్​ఈసీఐ)తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) ఉంది. 

టారిఫ్​ను ప్రతి కిలోవాట్​ అవర్​కు రూ.2.69 చొప్పున నిర్ణయించారు. ఇది జాతీయ స్థాయిలో సగటు పవర్ ప్రొక్యూర్‌‌‌‌మెంట్ ఖర్చు (ఏపీపీసీ) కంటే చాలా తక్కువని మే 28న రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో ఏజీఈఎల్​ తెలిపింది. ఈ ప్లాంట్​ను విజయవంతంగా ప్రారంభించడంతో, ఏజీఈఎల్​ఇన్​స్టాల్డ్​ కెపాసిటీ ఇప్పుడు 5.8 గిగావాట్లకు చేరింది.
సోలార్​  విండ్​ విద్యుత్ ఉత్పత్తి చేసే హైబ్రిడ్ పవర్ ఈ కొత్త ప్లాంట్ ఉత్పత్తి  అంతరాయాన్ని పరిష్కరించి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌‌‌‌ను తీర్చుతుందని అదానీ ప్రకటించింది.  విండ్-సోలార్ హైబ్రిడ్ ఎనర్జీ  తమ వ్యాపార వ్యూహంలో చాలా ముఖ్యమని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఎండీ & సీఈవో వినీత్​ జైన్ అన్నారు.

 

ఇవి కూడా చదవండి

2 రోజుల్లో కేరళకు రానున్న రుతుపవనాలు

ఏడాది చివరి నాటికి కొత్త పంబన్ వంతెన పూర్తి