న్యూఢిల్లీ: దేశంలోని మరిన్ని ఎయిర్పోర్టులను చేజిక్కించుకోవాలని అదానీ గ్రూప్ ప్లాన్ చేస్తోంది. లీడింగ్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్గా మారాలనే టార్గెట్ చేరేందుకు ఇంకా కొన్ని ఎయిర్పోర్టులకు బిడ్స్ వేయనున్నట్లు అదానీ ఎయిర్పోర్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరుణ్ బన్సాల్ వెల్లడించారు. కిందటిసారి ప్రభుత్వం బిడ్స్ పిలిచినప్పుడు అదానీ ఎయిర్పోర్ట్స్ ఏకంగా ఆరు ఎయిర్పోర్టులను దక్కించుకుంది. రాబోయే కొన్నేళ్లలో డజనుకిపైగా ఎయిర్పోర్టులను ప్రైవేటుకి అప్పచెప్పాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ బిడ్డింగ్ ప్రాసెస్లో తమ గ్రూప్ పాల్గొంటుందని బన్సాల్ చెప్పారు. నవీ ముంబై ఎయిర్పోర్టును 2,866 ఎకరాలలో ఇప్పటికే అదానీ గ్రూప్ డెవలప్ చేస్తోంది.
2030 నాటికి ఈ ఎయిర్పోర్టు 9 కోట్ల మంది ప్యాసింజెర్స్ను హ్యాండిల్ చేయగలిగేలా అప్గ్రేడ్ చేస్తున్నారు. రాజధాని ఢిల్లీలో కూడా మరో కొత్త ఎయిర్పోర్టును జురిచ్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ డెవలప్ చేస్తోంది. ఈ ఎయిర్పోర్టుకు ఏటా 7 కోట్ల మంది ప్యాసింజెర్లను హ్యాండిల్ చేయగలుగుతుంది. కర్నాటక, గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో మరికొన్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు ఏర్పాటు కానున్నాయి. అదానీ గ్రూప్ చేతిలోని 7 ఎయిర్పోర్టులూ డొమెస్టిక్ ట్రావెలర్స్ సెగ్మెంట్లో 92 శాతం గ్రోత్, ఇంటర్నేషనల్ట్రావెలర్స్ సెగ్మెంట్లో 133 శాతం గ్రోత్ను సాధించాయి. ఈ ఎయిర్పోర్టులకు వచ్చే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ సంఖ్య కూడా వరసగా 58 శాతం, 61 శాతం చొప్పున పెరిగాయి.
ఏవియేషన్పై బుల్లిష్గా ఉన్నాం....
దేశంలోని ఏవియేషన్ మార్కెట్పై తాము బుల్లిష్గా ఉన్నామని బన్సాల్ పేర్కొన్నారు. డిసెంబర్ 2024 నాటికి నవీ ముంబై ఎయిర్పోర్టు ఫస్ట్ఫేజ్ పూర్తవుతుందని చెప్పారు. ఈ ఫేజ్లో 2 కోట్ల మంది ప్యాసింజర్లను హ్యాండిల్ చేసే కెపాసిటీ వస్తుందని వివరించారు. ముంబై ఎయిర్పోర్టును కూడా అదానీ గ్రూపే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాబోయే రెండేళ్లలో 12 బిలియన్ డాలర్లను దేశంలోని ఎయిర్పోర్టులపై ఖర్చు పెట్టాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఎయిర్లైన్స్ కంపెనీలు ఇప్పటికే వందలాది విమానాల కోసం ఆర్డర్లు కూడా ఇచ్చాయి. ఎయిర్ట్రావెల్ భారీగా పెరుగుతుండటంతో ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఒత్తిడి ఎక్కువవుతోంది.