యాదాద్రి జిల్లాలో ప్యాడీ క్లీనర్ల కొనుగోలుకు కమిటీ ఏర్పాటు

యాదాద్రి జిల్లాలో ప్యాడీ క్లీనర్ల కొనుగోలుకు కమిటీ ఏర్పాటు

యాదాద్రి, వెలుగు : వానాకాలం సీజన్​వడ్ల కొనుగోలు ప్రక్రియ కోసం అవసరమైన వాటిని గుర్తించాలని అడిషనల్​ కలెక్టర్​ వీరారెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్​లో ఆఫీసర్లతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. కొనుగోలు సెంటర్లకు ప్యాడీ క్లీనర్లు ఎన్ని అవసరం పడతాయో ఇండెంట్ రెడీ చేయాలన్నారు. వీటి కొనుగోలు, పర్యవేక్షణకు అడిషనల్ కలెక్టర్, డీఆర్డీవో, డీసీవో, డీఏవో, సివిల్ సప్లయ్ డీఎం, లీగల్​ మెట్రాలజీ ఆఫీసర్​తో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. 

చిట్యాల గోడౌన్​ తీసుకోండి..

2023–-24 యాసంగి సీజన్​కు సంబంధించిన సీఎంఆర్​ను వెంటనే అందించాలని అడిషనల్ కలెక్టర్​వీరారెడ్డి ఆదేశించారు. మిల్లర్లతో నిర్వహించిన మీటింగ్​లో ఆయన మాట్లాడారు. బియ్యం నిల్వ కోసం స్థలం కొరత ఉన్నందున చిట్యాలలోని గోడౌన్​ను తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్​పోర్ట్​లో జాప్యం జరగకుండా రైల్వే వ్యాగన్ల సంఖ్య పెంచాలన్నారు. వేర్వేరుగా నిర్వహించిన మీటింగ్స్​లో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.