ముకేశ్ అంబానీ తాతయ్యారు. ఆయన కుమార్తె ఇషకి కవల పిల్లలు జన్మించారు. ఒక పాప, బాబు జన్మించారని.. వారికి ఆదియ, కృష్ణ అని పేర్లు పెట్టినట్లు వెల్లడించారు. ఈసందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఇష, ఆనంద్ పిరమాల్ దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందరి నుంచి తాము శుభాభినందనలు కోరుకుంటున్నట్లు తెలిపారు.
వాస్తవానికి అంబానీ, పిరమాల్ కుటుంబాల మధ్య 40 ఏళ్లుగా చక్కటి స్నేహబంధం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో దేశ దిగ్గజ వ్యాపారవేత్తల్లో ఒకరైన పిరమాల్ సంస్థల వారసుడు ఆనంద్ పిరమాల్ను ఇష 2018 డిసెంబరు 12న వివాహం చేసుకున్నారు. ముంబయిలోని పెడ్డార్ రెడ్లో ఉన్న విలాసవంతమైన అంబానీ ఇల్లు ‘యాంటీలా’లో ముకేశ్ అంబానీ గారాల పట్టి ఈశా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ శుభలేఖ ఖరీదు రూ.3 లక్షలకు పైనేనట. దీని సంగతి పక్కన పెడితే ఇషాకు అత్తింటి వారు పెద్ద గిఫ్ట్ ఇచ్చారు. ముంబైలోని వర్లీ ప్రాంతంలో పిరమాల్ కుటుంబం పేరిట ఉన్న రూ.450 కోట్ల విలువైన గులీటా భవనాన్ని అజయ్, స్వాతి పిరమాల్ దంపతులు ఈశా-ఆనంద్ జంటకు కానుకగా ఇచ్చారు.