
పటేల్ జోక్యముంటే కాశ్మీర్లో సమస్యే ఉండేది కాదు
స్పెషల్ స్టేటస్ అడ్డుపెట్టుకుని కాశ్మీర్లో అవినీతి రాజ్యం
కేంద్ర నిధులను ఈజీగా లూటీ చేశారు..
రద్దుతో పని పూర్తికాలేదు.. అభివృద్ధి దిశగా నడిపించాలి
కార్యకర్తలకు షా దిశానిర్దేశం
ఆర్టికల్ 370 రద్దు అంశంపై ముంబైలో సెమినార్
‘‘మాజీ ప్రధాని జవహర్లాల్నెహ్రూ తప్పు వల్లే పాక్ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) ఉనికిలోకి వచ్చింది. ఆనాడు అనవసరంగా పాకిస్తాన్తో కాల్పుల విరమణను నెహ్రూ ప్రకటించి ఉండకపోతే.. పీఓకే అనేదే ఉండేది కాదు. కాశ్మీర్ అంశాన్ని నెహ్రూకు బదులుగా తొలి హోం మంత్రి సర్దార్వల్లభాయ్ పటేల్ టేకప్ చేసి ఉండాల్సింది” అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. జమ్మూకాశ్మీర్కు స్పెషల్ స్టేటస్ కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఆదివారం ముంబైలో జరిగిన ఓ సెమినార్లో మాట్లాడారు. ‘‘ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పటివరకు కాశ్మీర్లో ఒక్క బుల్లెట్కూడా కాల్చలేదు. కాశ్మీర్లో ఇప్పుడు కల్లోలం లేదు, అశాంతి లేదు. త్వరలోనే టెర్రరిజం కూడా అంతమవుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
వారికి చలిలోనూ చమటలు పడుతున్నాయి..
‘కాశ్మీర్లో పాలన సాగించిన 3 కుటుంబాలు.. ఆర్టికల్ 370 సాకు చూపుతూ ఏసీబీని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వలేదు. ప్రస్తుతం చల్లటి వాతావరణం ఉన్నా కూడా.. అవినీతి చేసిన వారందరికీ చమటలు పడుతున్నాయి” అని విమర్శించారు. ‘‘స్పెషల్ స్టేటస్ను రద్దు చేయడంతోనే మన పని పూర్తి కాలేదు. అసలు పని ఇప్పుడే మొదలైంది. నేషనలిజం, ప్రోగ్రెస్అనే అంశాల ఆధారంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే మన లక్ష్యం” అని బీజేపీ కార్యకర్తలకు షా పిలుపునిచ్చారు. ఆర్టికల్ 370 రద్దును కాంగ్రెస్, ఎన్సీపీలు సిగ్గులేకుండా వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. ‘‘రాహుల్గాంధీ, శరద్పవార్ఒక విషయం ప్రజలకు చెప్పాలి. ఇంతకీ వారు ఆర్టికల్370 రద్దు నిర్ణయాన్ని సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా?” అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధిస్తుందని, ఫడ్నవీస్ మరోసారి సీఎం అవుతారన్నారు.
రాహుల్.. నిన్న లేక మొన్న వచ్చారు
‘‘ఆర్టికల్ 370 అనేది పొలిటికల్ అంశం అని రాహుల్గాంధీ అంటున్నారు. రాహుల్బాబా గారు.. మీరు రాజకీయాల్లోకి ఇప్పుడొచ్చారు. కానీ బీజేపీకి చెందిన మూడు తరాలు కాశ్మీర్కోసం, ఆర్టికల్370 రద్దు కోసం తమ జీవితాలను అర్పించాయి. ఇది మాకు పొలిటికల్ మ్యాటర్కాదు. భారత మాతను విభజించకుండా ఉండాలన్న మా లక్ష్యంలో ఒక భాగం’’ అని షా విమర్శించారు.
బంగారంతో ఇళ్లు కట్టుకునేటోళ్లు
‘‘జమ్మూకాశ్మీర్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రూ.2.27 లక్షల కోట్లను ఆ ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. నిజానికి ఆ నిధులు ప్రజల వరకు చేరాయా? ప్రజలకు అంది ఉంటే.. వాళ్ల ఇంటికి బంగారు పైకప్పులను ఏర్పాటు చేసుకునేటోళ్లు” అని అమిత్ షా అన్నారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసమే ఆర్టికల్370ని రద్దు చేశామన్నారు. ‘‘ఆర్టికల్370 వల్ల కాశ్మీర్లో యాంటీ కరప్షన్ బ్యూరోను ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉండేది కాదు. దీంతో అభివృద్ధి కోసం ప్రభుత్వం కేటాయించే నిధులను కొందరు ఈజీగా లూటీ చేసేవారు. నిజానికి ఆర్టికల్370ని కాశ్మీర్కల్చర్ను ప్రొటెక్ట్ చేసేందుకు కాదు.. తమ అవినీతి బయటపడకుండా ఉండేందుకు రాజకీయ నాయకులు వాడుకున్నారు” అని మండిపడ్డారు.