భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థతో రిలయన్స్ పవర్ ఒప్పందం

భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థతో రిలయన్స్ పవర్ ఒప్పందం

హైదరాబాద్​, వెలుగు: అనిల్​ అంబానీ గ్రూపునకు చెందిన రిలయన్స్​పవర్,​ భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గ్రీన్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో (జీడీఎల్​) దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం వాణిజ్య నిబంధనల పత్రంపై సంతకం చేసింది. 

 దీని ప్రకారం రెండు సంస్థలు కలిసి భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను 50:50 నిష్పత్తిలో అభివృద్ధి చేయాలి. ఈ ప్రాజెక్ట్  స్థాపిత సామర్థ్యం 500 మెగావాట్లు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్​ను బిల్డ్ -ఓన్ -ఆపరేట్ (బీఓఓ) విధానంలో చేపడతారు. దీనికోసం దాదాపు రూ.రెండు వేల కోట్లు ఇన్వెస్ట్​ చేస్తారు. ఇది భూటాన్  సౌర విద్యుత్ రంగంలో అతిపెద్ద  ప్రైవేట్ రంగ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్​డీఐ) అని రిలయన్స్​ పవర్​ తెలిపింది.  కార్యక్రమంలో భూటాన్ ​ప్రధాని దాషో షెరింగ్​ టోగ్బే, అనిల్​అంబానీ పాల్గొన్నారు.