ఐఫోన్లో 3 మోడల్స్ అమ్మకాలు ఇండియాలో బంద్

ఐఫోన్లో 3 మోడల్స్ అమ్మకాలు ఇండియాలో బంద్

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ యాపిల్ కీలక నిర్ణయం తీసుకుంది. పలు పాత ఐఫోన్ మోడల్స్ అమ్మకాలను ఇండియాలో నిలిపివేస్తున్నట్లు నిర్ణయించింది. ఐఫోన్ 6S, 6S ప్లస్, ఐఫోన్ SE ఫోన్ల అమ్మకాలను నిలిపివేస్తున్నామని యాపిల్ ప్రకటించింది.

ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఫోన్లు రిటెయిల్ మార్కెట్‌తోపాటు ఆన్‌లైన్ మార్కెట్లు అయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్లలోనూ  వినియోగదారులకు లభించవు. ఈ మోడల్ ఐఫోన్లు అమెరికాలో మాత్రం అందుబాటులో ఉంటాయని ఆపిల్ తెలిపింది. కొత్తగా విడుదలవుతున్న ఐఫోన్ల మోడళ్ల అమ్మకాలను మరింత పెంచేందుకే పాత ఐఫోన్ల అమ్మకాలను యాపిల్ నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది.