న్యూఢిల్లీ: ఇటీవలే లాంచ్ అయిన ఐఫోన్ 14ను ఇండియాలోనూ తయారు చేస్తామని అమెరికా టెక్ కంపెనీ యాపిల్ ప్రకటించింది. ప్రొడక్టుల తయారీని చైనా నుంచి ఇతర దేశాలకు తరలిస్తున్న కంపెనీల లిస్టులో ఇది కూడా చేరింది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్లను యాపిల్ ఈనెల ఏడున లాంచ్ చేసింది. నిజానికి యాపిల్ 2017లోనే ఐఫోన్ ఎస్ఈ మోడల్ తయారీతో ఇండియాలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఐఫోన్ ఎస్ఈతోపాటు ఐఫోన్12,13 మోడల్స్ కూడా మనదేశంలో తయారవుతున్నాయి. ‘మేడిన్ ఇండియా’ ఐఫోన్14 మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి రానుంది. మన దగ్గర తయారైన ఫోన్లను విదేశాలకూ ఎగుమతి చేస్తారు.
చెన్నై శివార్లలోని శ్రీపెరుంబుదూర్లో గల ఫాక్స్కాన్ ఫెసిలిటీలో ఐఫోన్14ను తయారు చేస్తారు. ఈ సంస్థ యాపిల్కు అతిపెద్ద కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్. 2025 నాటికి ప్రతి నాలుగింటిలో ఒక ఐఫోన్ ఇండియాలోనే తయారవుతుందని జేపీ మోర్గన్ పోయిన వారం విడుదల చేసిన నోట్లో పేర్కొంది. యాపిల్ 2020లోనే మనదేశంలో రిటైల్ స్టోర్ను కూడా తెరిచింది. దీంతో ఇండియా మార్కెట్ నుంచి వచ్చే ఆదాయం భారీగా పెరిగిందని యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.