ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు..రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు..రంగారెడ్డి కలెక్టర్ సి.నారాయణరెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: స్థానిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని రంగారెడ్డి కలెక్టర్​ సి.నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం రంగారెడ్డి కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ వెల్లడించిన వెంటనే ఎలక్షన్​ కోడ్​ అమలులోకి వచ్చిందన్నారు. నోటిఫికేషన్ ఈ నెల 9న వస్తుందన్నారు.  

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫేజ్ 1కు సంబంధించి 9 నుండి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. 12న పరిశీలన, అదే రోజు సాయంత్రం 5 గంటల తరువాత నామినేటెడ్ అభ్యర్థుల జాబిత విడుదల చేస్తామన్నారు. 13న అప్పీళ్లు, 14 న అప్పీళ్ల పరిష్కారం, 15న నామినేషన్ల ఉపసంహరణ, ఫైనల్​ లిస్టు విడుదల చేస్తామన్నారు. సర్పంచ్ ఫేజ్ -1 ఎన్నికలకు సంబంధించి 17 నుంచి 19 వరకు నామినేషన్ల స్వీకరణ, 23న ఉపసంహరణ, అదే రోజు ఫైనల్​ లిస్టు విడుదల చేస్తామన్నారు. సమావేశంలో అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్, జడ్పీ  సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్​మోహన్   పాల్గొన్నారు.