కర్ణాటకలో కొత్త శకం రాబోతోంది : యెడ్యూరప్ప

కర్ణాటకలో కొత్త శకం రాబోతోంది : యెడ్యూరప్ప

కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం కర్ణాటక ప్రజల విజయం అన్నారు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యెడ్యూరప్ప. కుమారస్వామి ప్రభుత్వం పనితీరుపై కన్నడ ప్రజలు విసిగిపోయి ఉన్నారని చెప్పారు. కొత్తపాలన, అభివృద్ధి రాబోతోందని కర్ణాటక ప్రజలకు హామీ ఇస్తున్నానని చెబుతున్నా అన్నారు. కర్ణాటక రైతులకు రాబోయే రోజుల్లో మరింత ప్రాధాన్యత పెరుగుతుందని.. వారికి మంచిరోజులు రాబోతున్నాయని చెప్పారు యడ్యూరప్ప.