పిచ్చిపిచ్చిగా మాట్లాడితే గాడిద మీద ఊరేగిస్తం: దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్

పిచ్చిపిచ్చిగా మాట్లాడితే గాడిద మీద ఊరేగిస్తం: దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్

హైదరాబాద్, వెలుగు : సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి మీద పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఓయూకు ఎత్తుకొచ్చి గుండు కొట్టిచ్చి గాడిద మీద ఊరేగిస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌‌‌‌‌‌‌కు పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్ వార్నింగ్​ఇచ్చారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని లేకుంటే, ఒళ్లు చింతపండు అవుతుందన్నారు. గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రిపై, కాంగ్రెస్ సర్కార్​పై వ్యక్తిగత దూషణలు చేస్తే రాష్ట్రంలో తిరగకుండా చేస్తామని సుమన్‌‌‌‌‌‌‌‌ను హెచ్చరించారు.

‘‘కేసీఆర్ మూతి నాకే కుక్కవు. కేసీఆర్ తినేసిన బొక్కలు చీకే వ్యక్తివి. రాష్ట్ర ప్రజలను దోచుకున్న దొంగలకు కాపలా దారునివి. చెన్నూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రజలు తన్నితే ఇక్కడ పడ్డావు” అని ఆయన మండిపడ్డారు. పదేండ్లు దొంగలు, దోపిడీదారుల మీద యుద్ధం చేసి చేసిన సీఎం రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి సుమన్‌‌‌‌‌‌‌‌కు లేదన్నారు. పిచ్చి మాటలు మాట్లాడుతున్న బాల్క సుమన్, కేటీఆర్ ముక్కు నేలకు రాయాలని ఆయన డిమాండ్ చేశారు.

అమాయకులను చంపిండు: చారగొండ వెంకటేశ్​

పదేండ్లుగా దోచుకున్న సొమ్మును కక్కిస్తామనే భయంతోనే కేటీఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌రావు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని పీసీసీ ప్రధాన కార్యదర్శి చారగొండ వెంకటేశ్ అన్నారు.  సోమవారం గాంధీ భవన్​లో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ సైంటిఫిక్ ఆధారాలతో ప్రాజెక్టుల గురించి మాట్లాడారని, అది జీర్ణించుకోలేక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. నోటికొచ్చినట్టు మాట్లాడితే బాల్క సుమన్‌‌‌‌‌‌‌‌కు చెప్పు దెబ్బలు తప్పవని హెచ్చరించారు. బాల్క సుమన్ అమాయక విద్యార్థినుల జీవితాలతో ఆడుకున్న నీచుడని, సుమన్ వల్లే శ్రీకాంత చారి, వేణుగోపాల్ రెడ్డి చనిపోయారని ఆరోపించారు.