
కాసేపట్లో అమృత్ సర్ లో ఆప్ నేత కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించనున్నారు. పంజాబ్ ప్రజలకు కృతజ్ఞతగా కేజ్రీవాల్ రోడ్ షో ఉంటుందని కాబోయే ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ఫుల్ ఫిల్ చేసేలా ఆశీర్వదించాలని గురు సాహేబ్ ను ప్రార్థిస్తామని అన్నారు. అమృత్ సర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేజ్రీవాల్ కు ఘన స్వాగతం పలికారు భగవంత్ మాన్.మరో వైపు ప్రజా ప్రతినిధులకు భద్రత కుదిస్తారా అన్న ప్రశ్నకు భగవంత్ మాన్ సమాధానం ఇచ్చారు. కొంత మంది భద్రత కంటే తమకు ప్రజల భద్రతే ముఖ్యమన్నారు. పోలీసులంటే కేవలం రాజకీయనాయకుల ఇంటి ముందు కాపలా కాసేవారిలాగే చూసేవారని.. ఆ సిస్టమ్ ను పూర్తిగా మారుస్తామన్నారు భగవంత్ మాన్.
Punjab CM-designate Bhagwant Mann receives AAP national convenor Arvind Kejriwal and party leader Manish Sisodia at Amritsar airport
— ANI (@ANI) March 13, 2022
Mann along with Kejriwal will hold a roadshow in the city after AAP swept Punjab polls. pic.twitter.com/hrV3H8odi9
మరిన్ని వార్తల కోసం
చైనాలో పెరుగుతున్న కోవిడ్ కేసులు