పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : భెల్ ​ఈడీ శ్రీనివాస రావు

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత : భెల్ ​ఈడీ శ్రీనివాస రావు

రామచంద్రాపురం, వెలుగు : పర్యావణాన్ని పరిరక్షించుకొవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని  బీహెచ్ఈఎల్  పీఈఎస్​డీ​ ఎగ్జిక్యూటీవ్​ డైరెక్టర్  శ్రీనివాసరావు అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భెల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున గ్రీన్​ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెయిన్​ గేట్ వద్ద పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఈడీ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్లాస్టిక్​ వాడకాన్ని అరికట్టి జీవవైవిద్యాన్ని కాపాడుకోవడం మనపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్​లో జూన్​ 5 నుంచి జూలై 4 వరకు పర్యావణ మాసాన్ని పాటించనున్నట్లు తెలిపారు. పర్యావరణ రక్షణకు పలు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించి, ఆరోగ్యకర వాతావరణ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనరల్​ మేనేజర్​ విజయ సాగర్​, పీఈఎస్​డీ జీఎంలు, డీఆర్​ఓలు, హెఆర్​, సీఐఎస్​ఎఫ్​ ఉద్యోగులు, అన్ని విభాగాల యూనియన్​ ప్రతినిధులు, భెల్​ ఉద్యోగులు పాల్గొన్నారు.