
రామచంద్రాపురం, వెలుగు : పర్యావణాన్ని పరిరక్షించుకొవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని బీహెచ్ఈఎల్ పీఈఎస్డీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భెల్ ఉద్యోగులు పెద్ద ఎత్తున గ్రీన్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మెయిన్ గేట్ వద్ద పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేశారు.
ఈ సందర్భంగా ఈడీ శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టి జీవవైవిద్యాన్ని కాపాడుకోవడం మనపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. బీహెచ్ఈఎల్లో జూన్ 5 నుంచి జూలై 4 వరకు పర్యావణ మాసాన్ని పాటించనున్నట్లు తెలిపారు. పర్యావరణ రక్షణకు పలు అవగాహణ కార్యక్రమాలు నిర్వహించి, ఆరోగ్యకర వాతావరణ నిర్మాణానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జనరల్ మేనేజర్ విజయ సాగర్, పీఈఎస్డీ జీఎంలు, డీఆర్ఓలు, హెఆర్, సీఐఎస్ఎఫ్ ఉద్యోగులు, అన్ని విభాగాల యూనియన్ ప్రతినిధులు, భెల్ ఉద్యోగులు పాల్గొన్నారు.