పిలాయిపల్లి ద్వారా సాగునీరు అందిస్తాం : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి

పిలాయిపల్లి ద్వారా సాగునీరు అందిస్తాం : కుంభం అనిల్​కుమార్​ రెడ్డి
  • ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి 

యాదాద్రి, వెలుగు : పిలాయిపల్లి కాలువ ద్వారా సాధ్యమైనంత త్వరగా సాగునీరు అందిస్తామని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్​కుమార్​ రెడ్డి తెలిపారు. సోమవారం పెద్దగూడెం చానల్​ నుంచి జగత్​పల్లి, నారాయణగిరి వరకు పిలాయిపల్లి కాల్వను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాల్వ పనులు త్వరగా పూర్తిచేయాలని ఇరిగేషన్​ ఆఫీసర్లను ఆదేశించారు.

 ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పిలాయిపల్లి, ధర్మారెడ్డి, బునాదిగాని కాల్వల మరమ్మతులకు రూ.500 కోట్లు మంజూరు చేయించినట్టు తెలిపారు. టెండరింగ్​ పూర్తయి పనులు కూడా జరగుతున్నాయని చెప్పారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.