సాగునీరు ఇవ్వాలంటూ రాస్తారోకో

సాగునీరు ఇవ్వాలంటూ రాస్తారోకో

కరీంనగర్​ రూరల్​, వెలుగు : కరీంనగర్​ రూరల్​ మండలంలోని ఎస్సారెస్పీ కాలువల ద్వారా ఆయకట్టు చివరి దాకా సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని ముగ్ధుంపూర్​ గ్రామంలోని రాజీవ్​ రహదారిపై బీజేపీ లీడర్లు, రైతులు ఆందోళన చేపట్టారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్​గౌడ్, మండల అధ్యక్షుడు సంతోష్ కుమార్  మాట్లాడుతూ డీ-89, డీ-94, 3ఎల్​ కాలువల ద్వారా 600

క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా ఇందులో సగం కూడా ఇవ్వకుండా సాగునీరుస్తున్నామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. సాగునీరందక పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. ఆందోళనతో కరీంనగర్​, రామగుండం హైవేపై రాకపోకలు స్తంభించిపోయాయి. కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, లీడర్లు సుధాకర్, తిరుపతి, నరేందర్, మల్లన్న, రైతులు పాల్గొన్నారు.