- యూపీఏ హయాంలో అవినీతిపై వీడియో సిరీస్
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన కుంభకోణాలపై ‘‘కాంగ్రెస్ ఫైల్స్” పేరుతో సోషల్ మీడియా వేదికగా బీజేపీ ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ‘‘కాంగ్రెస్ ఫైల్స్” వీడియో సిరీస్లోని మొదటి వీడియోను బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆదివారం పోస్ట్ చేసింది. 3 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియో క్లిప్లో మన్మోహన్ సింగ్ప్రధానిగా ఉన్న టైంలో జరిగిన 2జీ స్కాం, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ గేమ్స్ స్కాంల గురించి ప్రస్తావించారు. యూపీఏ సర్కారు ఇంచుమించు రూ.4.82 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలకు పాల్పడిందని అందులో ఆరోపించారు. ‘‘గతంలో పెద్దపెద్ద కుంభకోణాలకు పాల్పడిన వాళ్లంతా.. ఇప్పుడు ఒక్కటవుతున్నరు. వాళ్లంతా కలిసి ‘‘భ్రష్టాచారీ బచావో ఆందోళన్” మొదలుపెట్టిన్రు. వాళ్లను వాళ్లు కాపాడుకునేందుకే ఈ ప్రయాస”అని మార్చి 28న ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ వచ్చిన వారంలోనే బీజేపీ సోషల్ మీడియా వింగ్ ‘‘కాంగ్రెస్ ఫైల్స్” వీడియో సిరీస్ను మొదలుపెట్టడం గమనార్హం.