- సెన్సిటివ్ విలేజ్లపై పోలీసుల నజర్
- సీసీ కెమెరాలు, నిఘా టీంతో పర్యవేక్షణ
నిజామాబాద్, వెలుగు : జిల్లాలో ఫస్ట్ ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగే బోధన్ డివిజన్లో యంత్రాంగం పోలింగ్ కు ఏర్పాట్లు చేస్తోంది. పోలింగ్ కేంద్రాలను అధికారులు క్రాస్ చెక్ చేస్తున్నారు. ఆదివారం అధికారులకు శిక్షణ ముగించి మండలాలవారీగా పోలింగ్ కేంద్రాలకు అలాట్ చేశారు. ప్రతి సెంటర్లో పీవో, ఏపీవో, హెల్ప్ డెస్క్లో బీఎల్వోను అందుబాటులో ఉంచుతారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా పోలీస్శాఖ బైండోవర్లు చేస్తోంది. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విలేజ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టింది.
ఏకగ్రీవాలతో కొంత ఊరట..
బోధన్డివిజన్లోని11 మండలాల్లో మొత్తం 184 గ్రామ పంచాయతీలు, 1,642 వార్డులున్నాయి. పోలింగ్నిర్వహించడానికి 1,653 సెంటర్లు గుర్తించారు. అయితే 29 మంది సర్పంచ్ల ఎన్నిక ఏకగ్రీవం కావడంతో 155 గ్రామాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 519 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 575 వార్డులు కూడా యునానిమస్అయ్యాయి. మిగితా 1,060 వార్డులకు పోలింగ్ ఏర్పాట్లు చేస్తుండగా, 2,734 మంది క్యాండిడేట్స్బరిలో ఉన్నారు. పోలింగ్నిర్వహణకు 20 శాతం రిజర్వ్ కలిపి 2,200 మందిని మండలాలవారీగా నియమించారు.
472 సెంటర్లలో సమస్య..
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అల్లర్లు జరిగే చాన్స్ ఉన్న విలేజ్లను పోలీసులు గుర్తించారు. పాత రికార్డులతోపాటు తాజా పరిస్థితుల ఆధారంగా ఫస్ట్ఫేజ్ ఎలక్షన్ జరిగే బోధన్డివిజన్లో 403 సెన్సిటివ్, 69 హైపర్ సెన్సిటివ్ పోలింగ్కేంద్రాలను గుర్తించారు. ఫ్లాగ్మార్చ్నిర్వహించి ప్రజలకు ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నారు. అనుమానితులను బైండోవర్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 326 రౌడీ షీటర్ల కదలికలపై నిఘా పెట్టారు. సమస్యాత్మక పోలింగ్కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు.
