
తిరువనంతపురం: బ్రిటన్ నేవీకి చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ శనివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఈ విమానం బ్రిటన్కు చెందిన ఓ విమాన వాహక నౌక నుంచి బయల్దేరినట్లు సమాచారం. రాత్రి 9:20 గంటల సమయంలో ఇంధనం తక్కువగా ఉందని ఫ్లైట్కంట్రోల్సెంటర్కు సమాచారం ఇవ్వడంతో ఎయిర్పోర్టు ఆఫీసర్లు వెంటనే అత్యవసర ప్రకటన చేశారు.
దీంతో రాత్రి 9:30 గంటలకు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ స్టెల్త్ ఫైటర్ జెట్ హిందూ మహాసముద్రంలో బ్రిటిష్ నేవీ కార్యకలాపాల్లో భాగంగా ఉన్నట్లు సమాచారం. వాతావరణం బాగాలేకపోవడం కూడా అత్యవసర ల్యాండింగ్కు ఒక కారణమని తెలుస్తున్నది. విమానాశ్రయ సిబ్బంది సమర్థవంతంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విమానం తిరిగి ఎప్పుడు బయల్దేరుతుందనేది అధికారులు వెల్లడించలేదు.