
హైదరాబాద్ లో ఓ రోడ్డు ప్రమాదం చిన్నారి ప్రాణం తీసింది. గాంధీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్యాంక్ బండ్ పై తెల్లవారుజామున ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, కారు ఢీకొనడంతో మూడు సంవత్సరాల చిన్నారి శ్రీ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లి సామాన్య, తండ్రి శివకుమార్ , కారు డ్రైవర్ కు గాయాలు అయ్యాయి. దీంతో పాప తల్లిదండ్రులను మెరుగైన వైద్య చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. సామాన్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్తుండగా ట్యాంక్ బండ్ పై ఈ ఘటన జరిగింది. క్యాబ్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: