- మరో 7 వ్యాక్సిన్లు రెడీ అయితున్నయ్
- కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్
న్యూఢిల్లీ: మనదేశంలో భవిష్యత్ అవసరాల మేరకు మరో ఏడు కరోనా వ్యాక్సిన్లు రెడీ అవుతున్నాయని కేంద్ర హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ శనివారం మీడియాకు చెప్పారు. మూడు వ్యాక్సిన్లు ట్రయల్ దశలో ఉన్నాయని, రెండు ప్రీ-క్లినికల్ దశలో ఉన్నాయని వెల్లడించారు. ఫేజ్ 1 లో ఒకటి, ఫేజ్ 2 దశలో మరొకటి ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొవిషీల్డ్, కొవాగ్జిన్ ల మీదనే ఆధారపడబోమని, దేశంలో అందరికీ వ్యాక్సిన్లు అందాలంటే మరిన్ని పరిశోధనలు, వ్యాక్సిన్ల డెవలప్మెంట్ అవసరమని అన్నారు. దేశంలో 50 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ వేసే ప్రక్రియ మార్చిలో స్టార్ట్ చేస్తామని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు.
For More News..