ముంబై డివిజన్లోని సబర్బన్ సెక్షన్ అంతటా భద్రతను పెంచేందుకు సెంట్రల్ రైల్వే ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్తో కూడిన సీసీటీవీ కెమెరాల ఏర్పాటును ప్రారంభించింది. నిర్భయ ఫండ్ ద్వారా బైకుల్లా రైల్వే స్టేషన్లో ఈ మొదటి సీసీటీవీ కెమెరాను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ముంబై డివిజన్లోని ఆరు స్టేషన్లలలో(ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, దాదర్, కుర్లా, థానే, లోకమాన్య తిలక్ టెర్మినస్, కళ్యాణ్) మాత్రమే ఏకీకృత భద్రతా వ్యవస్థలను కలిగి ఉన్నాయి.
వీటిలో ముఖాన్ని గుర్తించే సామర్థ్యాలతో హైటెక్ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. అయితే, మిగిలిన సబర్బన్ స్టేషన్లో పాత సీసీటీవీ సాంకేతికతపై ఆధారపడి ఉన్నాయి. త్వరలో అక్కడ కూడా రికగ్నిషన్ సిస్టమ్తో కూడిన సీసీటీవీ కెమెరాల ఏర్పాటు చేయనున్నారు.
ముంబయి డివిజన్లోని 76 స్టేషన్లలో సబర్బన్ స్టేషన్లతో సహా దశలవారీగా మొత్తం 2,509 హైటెక్ సీసీటీవీ కెమెరాలు అమర్చనున్నారు. మసీదు వంటి ప్రముఖ స్టేషన్లలో ఇన్స్టాలేషన్ ఇప్పటికే ప్రారంభించబడింది. బైకుల్లా, చించ్పోకలి, కర్రీరోడ్లలో రెండు వారాల్లో పూర్తి కానుంది. రైల్వే అధికారుల సమాచారం ప్రకారం ప్రతి స్టేషన్లో ప్రయాణీకుల పాదచారుల ఆధారంగా ముఖాన్ని గుర్తించే సామర్థ్యాలతో నాలుగు నుండి పది సీసీటీవీ కెమెరాలు అందుబాటులో ఉండనున్నాయి.