చార్ల్స్​టన్ ఓపెన్‌లో​ రన్నరప్​‌గా సానియా జోడీ

చార్ల్స్​టన్ ఓపెన్‌లో​ రన్నరప్​‌గా సానియా జోడీ

హైదరాబాద్‌‌: ఇండియా టెన్నిస్‌‌ లెజెండ్‌‌ సానియా మీర్జా తన 44వ డబుల్స్‌‌ టైటిల్‌‌ను కొద్దిలో చేజార్చుకుంది. డబ్ల్యూటీఏ చార్ల్స్​టన్​ ఓపెన్‌‌ టోర్నమెంట్‌‌ విమెన్స్‌‌ డబుల్స్‌‌లో ఆమె రన్నరప్‌‌తో సరిపెట్టుకుంది. అమెరికాలోని సౌత్‌‌ కరోలినాలో ఆదివారం జరిగిన ఫైనల్లో సానియా (ఇండియా)–లూసీ హర్డెస్కా (చెక్‌‌ రిపబ్లిక్‌‌) జోడీ 2–6, 6–4, 10–7తో నాలుగో సీడ్‌‌ అండ్రెజా క్లాపక్‌‌ (స్లొవేనియా) – మగ్డా లినెటె (పోలాండ్‌‌) జంట చేతిలో పోరాడి ఓడిపోయింది. మొదటి సెట్‌‌లో తేలిపోయిన సానియా ద్వయం వెంటనే పుంజుకుంది. నువ్వానేనా అన్నట్టు రెండో సెట్‌‌లో గెలిచి మ్యాచ్‌‌లో నిలిచింది. సూపర్‌‌ టై బ్రైకర్​లోనూ అద్భుతంగా పోరాడినప్పటికీ నెగ్గలేకపోయిన సానియా రన్నరప్‌‌తో తిరిగొచ్చింది.