
చైనాలో 6 నెలల తర్వాత మళ్లీ ఒక కరోనా మరణం చోటుచేసుకుంది. బీజింగ్ నగరానికి చెందిన 87 ఏళ్ల వ్యక్తి కొవిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతూ చనిపోయాడు. అయితే మృతుడు కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాడా ? లేదా ? అనే దానిపై అధికార వర్గాలు స్పష్టత ఇవ్వలేదు. దీంతో చైనాలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 5,227కు చేరింది. చివరగా 2022 మే 26న చైనాలోని షాంఘైలో కరోనా మరణం సంభవించింది.
చైనాలో దాదాపు 92 శాతం జనాభాకు ఇప్పటికే కొవిడ్ వ్యాక్సినేషన్ జరిగింది. ఇప్పటికీ చైనాలోని చాలా నగరాల్లో కఠిన లాక్ డౌన్లు, క్వారంటైన్ నిబంధనలను అమలు చేస్తున్నారు. మరోవైపు జీరో కొవిడ్ విధానంతో చైనా ప్రజల్లో అసహనం తీవ్రరూపు దాలుస్తోంది.