- తమది కాదని తేల్చేసిన చైనా
బీజింగ్: చంద్రుడి ఉపరితలంపై మార్చి 4న ఓ రాకెట్ కూలిపోతుందని స్పేస్ సైంటిస్టులు వెల్లడించారు. ఈ రాకెట్ చైనా చేపట్టిన లూనార్ ఎక్స్ప్లొరేషన్ ప్రోగ్రాంలో ఏర్పడిన స్పేస్ జంక్కు చెందిందని ఆరోపించారు. తొలుత దీనిని స్పేస్ఎక్స్ ప్రయోగం తర్వాత అంతరిక్షంలో వదిలేసిన రాకెట్గా భావించామని చెప్పారు. అయితే, అది స్పేస్ఎక్స్ రాకెట్ కాకపోవచ్చని, 2014లో చైనా ప్రయోగించిన రాకెట్ బూస్టర్ అయి ఉంటుందని తాజాగా వెల్లడించారు. లూనార్ ఎక్స్ ప్లొరేషన్ ప్రోగ్రాంలో భాగంగా 2014లో ప్రయోగించిన ఛేంజ్5-టి 1 రాకెట్ బూస్టర్ ఇదేనని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అది చంద్రుడివైపు దూసుకెళుతోందని, వచ్చే నెల 4న క్రాష్ అవుతుందని చెప్పారు. అయితే, ఈ వాదనను చైనా కొట్టిపారేసింది. స్పేస్లోకి పంపించే రాకెట్ల విషయంలో అన్నిరకాలుగా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. ఛేంజ్ 5–టి1 రాకెట్ప్రయోగం విజయవంతమైందని పేర్కొంది. ఆ రాకెట్తో పంపిన బూస్టర్ తర్వాత భూవాతావరణంలోకి వచ్చి పేలిపోయిందని చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. తాజాగా చంద్రుడిపై కూలిపోనున్న రాకెట్తో తమకు ఎలాంటి సంబంధంలేదని తేల్చిచెప్పింది.