చిరునవ్వు కలకాలం ఉండాలంటే.. మాస్క్‌ తప్పనిసరి: మెగాస్టార్‌‌ సందేశం

చిరునవ్వు కలకాలం ఉండాలంటే.. మాస్క్‌ తప్పనిసరి: మెగాస్టార్‌‌ సందేశం
  • యాక్టర్లు కార్తీ, ఇషా రెబ్బాతో వీడియోలు
  • ట్వీట్‌ చేసిన మెగాస్టార్‌‌

హైదరాబాద్‌: రానున్న రోజుల్లో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుందని, మరింత జాగ్రత్తగా ఉండాలని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు చేసిన నేపథ్యంలో టాలీవుడ్‌ హీరో మెగాస్టార్‌‌ చిరంజీవి వీడియో సందేశం ఇచ్చారు. యాక్టర్లు కార్తీ, ఈషా రెబ్బాతో కలిసి చేసిన వీడియోలను పోస్ట్‌ చేశారు. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆ వీడియోల్లో సందేశం ఇచ్చారు. చిరునవ్వు కలకాలం నిలవాలంటే మాస్క్‌ ధరించాలంటున్న చిరు మెసేజ్‌ ఇచ్చారు. మీసం మెలేయడం వీరత్వం ఒకప్పుడు కానీ ఇప్పుడు మాస్క్‌ ధరించడం వీరుడి లక్షణం అని అన్నారు. “ కరోనా మరింత విజృంభిస్తుందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరికలు జారీ చేసింది. దయచేసి ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్రాథమిక జాగ్రత్తలు తీసుకుని, వీలైనప్పుడు చేతులు శుభ్రం చేసుకోండి. కచ్చితంగా మాస్కులు ధరించి, సాంఘీక దూరం పాటించండి” అంటూ రెండు వీడియోలు పోస్ట్‌ చేశారు.