యాదగిరిగుట్ట పీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్కు నోటీసులు జారీ

యాదగిరిగుట్ట పీహెచ్సీ ల్యాబ్ టెక్నీషియన్కు నోటీసులు జారీ

యాదాద్రి, యాదగిరిగుట్ట, వెలుగు : విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్​ హనుమంతరావు హెచ్చరించారు. కలెక్టర్​ ఆదేశాలతో డ్యూటీకి డుమ్మా కొట్టిన యాదగిరిగుట్ట పీహెచ్​సీ ల్యాబ్​ టెక్నీషియన్​కు డీఎంహెచ్​వో షోకాజ్ నోటీసులు జారీ చేశారు. యాదగిరిగుట్ట పీహెచ్​సీ, భువనగిరిలోని జ్యోతిబాపూలే రెసిడెన్షియల్​ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్​ స్కూల్స్​లో కలెక్టర్​ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గుట్టలోని పీహెచ్సీలోని ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించారు.

 అటెండెన్స్ రిజిస్టర్ ను తనిఖీ చేసి ఎంత మంది సిబ్బంది విధులకు హాజరయ్యారో అడిగి తెలుసుకున్నారు.  భువనగిరిలోపి హాస్టల్స్​ను సందర్శించిన ఆయన వంట సరుకులను పరిశీలించారు. స్టూడెంట్స్​తో మాట్లాడి బాగా చదువుకోవాలని సూచించారు.