జిల్లాలో అభివృద్ధికి పుష్కలంగా వనరులు : కలెక్టర్ జితేశ్

జిల్లాలో అభివృద్ధికి పుష్కలంగా వనరులు :  కలెక్టర్ జితేశ్
  • భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ జితేశ్​

భద్రాద్రికొత్తగూడెం/పాల్వంచ, వెలుగు : జిల్లాలో అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని కలెక్టర్​ జితేశ్​వి పాటిల్​ పేర్కొన్నారు. పాల్వంచలోని ఓ ప్రయివేట్​ గార్డెన్​లో టీఎన్​జీఓ, టీజీఓ, ట్రస్మా సంఘాలు, ఉద్యోగులతో  ప్రగతి టు గెదర్​ పేర నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సమన్వయంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. జిల్లాలో అభివృద్ధికి అవసరమైన వనరులున్నాయని, వాటిని ఉపయోగించుకోవడంలో వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మునగ, అజోల్లా, సమీకృత వ్యవసాయం, కొర్రమీను, కనుజు పిట్టల పెంపకం, బయోచార్​, ఇటుకల తయారీ లాంటి వాటిల్లో మెరుగైన ఫలితాలు సాధించామన్నారు.

వీటిపై మరింతగా దృష్టి సారిస్తే జిల్లా రైతాంగం ఆర్థికంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోందని తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్​ రాహూల్​ మాట్లాడుతూ గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరికీ తెలిసేలా వినూత్న ప్రోగ్రామ్​లు చేపడుతున్నామన్నారు. గిరిజన విద్యార్థుల భవిష్యత్​కు కెరీర్​ గైడెన్స్​ ప్రోగ్రామ్​ను విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గిరిజన మ్యూజియాన్ని  ఆధునీకరించామన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్​ కలెక్టర్​ డి. వేణుగోపాల్, ఆర్డీవో మధు, జడ్పీ సీఈఓ బి. నాగలక్ష్మి, ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు ఆఫీసర్లు పాల్గొన్నారు.